నయన్ విఘ్నేశ్ లవ్ స్టోరీ, పెళ్లి రూమర్ల మీద లెక్కలేనన్ని రూమర్లు రాగా..గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. గతేడాది జూన్ 9న వీరిద్దరి పెళ్లి మహాబలిపురంలో గ్రాండ్గా జరిగింది. తాజాగా నయన్ దంపతులు పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు. తాజాగా వీరి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ రోజున తమ పిల్లలిద్దరినీ పరిచయం చేశార. తమ మొదటి వివాహా వార్షికోత్సవం సందర్భంగా తమ పిల్లలను పరిచయం చేసారు. వీళ్లిద్దరు ఎంతో క్యూట్గా ఉన్నారని నెటిజన్స్ అభివర్ణిస్తున్నారు. నయనతార తన పొత్తిళ్లలో ఉన్న ఇద్దరు బిడ్డలను చూపించింది.ఎపుడు తన పిల్లలను మీడియాకు చూపించని నయనతార .. తన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ రోజున పరిచయం చేయడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ పిల్లలను పరిచయం చేయని ఈమె ఈ రోజున పరిచయం చేయడంపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయిన నయనతార.. ప్రస్తుతం కెరీర్లో కొత్త అడుగులు వేసేలా ప్లాన్ చేస్తోందట. పలు వ్యాపారాల్లో భాగం కావాలని అంతా పక్కాగా ప్లాన్ చేసుకుంటోందట. ఆ మధ్య నయన్, విగ్నేష్ కలసి సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు. వీళ్లు సరోగసీ ద్వారా పిల్లలను కనడంపై అప్పట్లో తీవ్ర వివాదం చెలరేగింది. ఇక్కడి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈమె ఈ పనిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
Uyir & Ulagam pic.twitter.com/G2dCs8ytdN
— Nayanthara✨ (@NayantharaU) June 9, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa