ఓం శాంతి ఓం సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి దీపిక పదుకొనే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకొని గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె నటుడు రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈమె ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో దీపిక పదుకొనే పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈమె మరోసారి మగవారి ఆడవారి స్టామినా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హాలీవుడ్ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి ఈమె ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె మగవారి స్టామినా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.సెక్స్ వ్యక్తిగత జీవితాల గురించి దీపిక మాట్లాడుతూ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో మగవారు మ్యాగీ కంటే చీప్ ఆడవారితో పోల్చుకుంటే మగవారి స్టామినా చాలా తక్కువ అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. అయితే ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు విన్నటువంటి వారందరూ దీపిక ఏంటి ఇలా మాట్లాడారు అంటూ ముక్కున వేలు వేసుకున్నారు.ఇలా ఉన్నఫలంగా మగవారి గురించి దీపిక ఇలాంటి కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి అని సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటివరకు హాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa