టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ ని హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'మామా మశీంద్ర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈరోజు ఈ సినిమా టీజర్ను సూపర్స్టార్ మహేష్బాబు ఆవిష్కరించారు. ఈషా రెబ్బా, మృణాళిని రవి, హర్షవర్ధన్, షకలక శంకర్ కూడా ఈ టీజర్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్ వినోదాత్మకంగా మరియు ఆసక్తికరంగా కనిపిస్తుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. హర్ష వర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, విందా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పిపై ప్రొడక్షన్ నెం 5గా నారాయణ్ దాస్ కె నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa