ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించిన 'కంగువ'

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 20, 2023, 08:44 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు 'కంగువ' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్‌ కేరళలో ప్రారంభమైనట్లు ఇప్ప‌టికే 50% చిత్రీక‌ర‌ణ పూర్తి అయ్యినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో సూర్య, దిశా పటానీ తదితరులు పాల్గొన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa