రితీష్ దేశ్ముఖ్ మరియు జెనీలియా నటించిన మరాఠీ బ్లాక్బస్టర్ 'వేద్' ఎట్టకేలకు OTT ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. రితీష్ దేశ్ముఖ్ తొలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కానుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన మజిలీ మూవీకి రీమేక్ అయిన ఈ మరాఠీ చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్గా ప్రదర్శించబడుతుందని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం మరాఠీతో పాటు హిందీలో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుందని OTT ప్లాట్ఫారమ్ ప్రకటించింది. ఈ సినిమాలో జియా శంకర్, అశోక్ సరాఫ్, విద్యాధర్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa