ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప ది రైజ్" సినిమా 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కాసుల వర్షం కురిపించింది. ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమాలో సునీల్, రావు రమేష్, అనసూయ, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించరు. ఇప్పుడు, అందరూ పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఇప్పుడు, ఈ యాక్షన్ డ్రామాలో సాయి పల్లవి గిరిజన యువతిగా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో తన పోర్షన్స్ని చిత్రీకరించేందుకు కేవలం 10 రోజులు మాత్రమే నటి కేటాయించినట్లు సమాచారం. అయితే ఈ వార్తకు సంబంధించి అధికారిక ధృవీకరణ మూవీ మేకర్స్ నుంచి రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa