మాన్యం కృష్ణ, అపర్ణా జంటగా నటిస్తున్న చిత్రం "మిస్టర్ కళ్యాణ్". ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రీసెంట్గానే ధమాకా డైరెక్టర్ నక్కిన త్రినాధరావు గారు ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియచేసారు. తాజాగా విడుదల తేదీని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు, యంగ్ హీరో ఆకాష్ పూరి రివీల్ చేసారు. ఈ మేరకు మార్చి 10వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తుంది.
శ్రీమతి ఉషశ్రీ సమర్పణలో శ్రీదత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై NV సుబ్బారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సప్తగిరి, తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa