నంద కిషోర్ అబ్బురు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ విలేజ్ డ్రామా చిత్రం ఫిబ్రవరి 18, 2023న మహా శివరాత్రి స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా అప్డేట్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ వారం ఈ సినిమా యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు, ఈ ఈవెంట్ కి ఏజెంట్ నటుడు అఖిల్ అక్కినేని ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ఆన్లైన్లో అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి జంటగా నటించింది. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa