గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా నైజాం రీజియన్ టోటల్ రన్ లో 17.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది అని సమాచారం. నైజాంలో 400 కంటే ఎక్కువ స్క్రీన్లలో విడుదలైన వీరసింహా రెడ్డి బాలయ్య కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా నిలిచింది.
ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్, నవీన్ చంద్ర మరియు అజయ్ ఘోష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa