మాలీవుడ్ స్టార్ హీరో మోహన్లాల్ జల్లికట్టు ఫేమ్ దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరితో ఒక సినిమాని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి 'మలైకోట్టై వాలిబన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ చేసారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రాజస్థాన్లో ప్రారంభమైంది. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. మోహన్ లాల్ మరియు తదితరులు ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు.
ఈ బిగ్గీలో మోహన్లాల్ రెజ్లర్గా కనిపించనున్నాడని సమాచారం. రాధికా ఆప్టే, విద్యుత్ జమ్వాల్, సోనలీ కులకర్ణి మరియు డానిష్ సైత్లు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మాక్స్ ల్యాబ్స్ మరియు సెంచరీ ఫిలింస్పై జాన్ మరియు మేరీ క్రియేటివ్ ఈ యాక్షన్ డ్రామాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa