గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా విడుదలైన తొలిరోజు సెడెడ్లో 5.5 కోట్లు వసూళ్లు చేసిఅంట్లు సమచారం. బాలయ్య కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. ఈ వారాంతంలో ఈ సినిమా మరింత వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్, నవీన్ చంద్ర మరియు అజయ్ ఘోష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa