ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 'వీర సింహారెడ్డి' టికెట్ ధరలపై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 11, 2023, 04:23 PM

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని లాక్ చేసారు. వీరసింహా రెడ్డి జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

తాజా అప్డేట్ ప్రకారం, 'వీర సింహారెడ్డి' టిక్కెట్టు ధరలను పెంచేందుకు మూవీ మేకర్స్ కి అనుమతినిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిఓను ఆమోదించింది. టికెట్ ధరపై 20 రూపాయల (జిఎస్‌టితో సహా) పెంచినట్లు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని థియేటర్లలోని ఈ నిబంధన 10 రోజులు మాత్రమే వర్తిస్తుంది అని సమాచారం.

ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa