ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాల్తేరు వీరయ్య ఐదవ పాట లాంచ్ ఈవెంట్ ఎక్కడంటే..?

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 10, 2023, 04:09 PM

బాబీ కొల్లి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ రాజా రవితేజ గారు కలిసి నటించిన "వాల్తేరు వీరయ్య"లో శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.


తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ ఫిఫ్త్ సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు 'నీకేమో అందమెక్కువ..నాకేమో తొందరెక్కువ' అనే లవ్లీ సాంగ్ రేపు ఉదయం 10:35 నిమిషాలకు విడుదల కానుందని తెలుస్తుంది. పోతే, ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ లోని, మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్రాండ్ గా జరగనుంది.


సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa