ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నైకి బయలుదేరిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మేకర్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 03, 2023, 04:02 PM

ప్రముఖ టాలీవుడ్ నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుండి ఈ సంక్రాంతి రెండు బిగ్ సినిమాలు రాబోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన "వాల్తేరు వీరయ్య", నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన "వీరసింహారెడ్డి" సినిమాలు జనవరి 13, 12 తేదీలలో ఇరు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్నాయి.


విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ రెండు చిత్రాల మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్, వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కొల్లి, వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలిసి ఈ రోజు చెన్నైకి వెళ్లడం జరిగింది. ఈ రెండు చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ను పూర్తి చెయ్యడానికి చెన్నై వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ లో ఈ ముగ్గురూ కలిసి దిగిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa