ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేటెస్ట్ : త్వరలోనే '7జి బృందావన్ కాలనీ' సీక్వెల్..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 31, 2022, 02:02 PM

ప్రముఖ నిర్మాత AM రత్నం తన తనయుడు రవికృష్ణ ని '7జి బృందావన్ కాలనీ' తో సినీరంగానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆయనే నిర్మించారు. సెల్వరాఘవన్ డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా 2004 లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఇందులో సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.


తాజాగా ఈ ఐకానిక్ సినిమాకు త్వరలోనే సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గా జరిగిన ఒక మీడియా ఇంటిరాక్షన్ లో నిర్మాత AM రత్నం గారు మాట్లాడుతూ 7జి బృందావన్ కాలనీకి సీక్వెల్ నిర్మించాలనే ఆలోచన ఉన్నట్టు పేర్కొన్నారు. మరి, ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్మెంట్ ఎప్పుడు, నటీనటులు ఎవరు, డైరెక్టర్ ఎవరు... అనే విషయాలను తెలుసుకోవాలని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


ప్రస్తుతం AM రత్నం గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ప్రెస్టీజియస్ 'హరిహర వీరమల్లు' బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa