నటి రష్మిక, నటుడు రిషబ్శెట్టి మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా రష్మికకు మరోసారి కౌంటర్ ఇచ్చాడు రిషబ్. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి, రష్మిక జంటగా నటించిన కిరిక్ పార్టీ చిత్రం విడుదలై ఆరేళ్లు పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ రిషబ్ ట్వీట్ చేశాడు. సెలబ్రేషన్స్లో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ అందరినీ ట్యాగ్ చేసిన రిషబ్, సినిమాలో కథానాయికగా నటించిన రష్మికను మాత్రం ట్యాగ్ చేయకపోవడంతో వీరిద్దరి గొడవలు నిజమనే టాక్ తెరపైకి వచ్చింది.