టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రీసెంట్ సెన్సేషనల్ హార్రర్ థ్రిల్లర్ గా నిలిచిన చిత్రం "మసూద". హీరోయిన్ సంగీత, తిరువీర్ రెడ్డి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సాయి కిరణ్ డైరెక్ట్ చేసారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు.
చిన్న సినిమాగా విడుదలై, చాలా చక్కటి థియేట్రికల్ రన్ ను, బాక్సాఫీస్ కలెక్షన్లను అందుకుంటున్న ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణా అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హీరో తిరువీర్ రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa