ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' కి 'పుష్ప' కనెక్షన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 08:21 PM

కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్పా చిత్రాన్ని హిందీలో విడుదల చేసిన గోల్డ్‌మైన్స్ టెలిఫిలిమ్స్ ఇప్పుడు విరూపాక్షను నార్త్ ఇండియన్ సర్క్యూట్‌లలో విడుదల చేస్తోంది అని సమాచారం.


ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో ఆంధ్రాలోని  మారుమూల గ్రామానికి వచ్చే ఇంజనీర్‌గా ఆ గ్రామంలో జరిగిన అనుమానాస్పద మరణాల వెనుక కథను తెలుసుకోవడానికి వచ్చిన ఇంజనీర్‌గా కనిపించనున్నారు అని లేటెస్ట్ టాక్.


భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa