ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య కోసం భీమవరం చేపల పులుసు తీసుకెళ్లిన ప్రభాస్..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 03:50 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ గారి ఫస్ట్ ఎవర్ టాక్ షో "అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2" లేటెస్ట్ ఎపిసోడ్ లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్ హాజరై, బాలయ్యతో క్రేజీ చిట్ చాట్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే కదా.


తన తోటి నటీనటులను, ఇంటికొచ్చిన అతిధులను రకరకాల రుచికరమైన నాన్ - వెజ్ వంటకాలతో కడుపునిండా భోజనం పెట్టే అలవాటున్న ప్రభాస్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న నేపథ్యంలో భీమవరం స్పెషల్ చేపల పులుసు, మటన్ తో చేసిన వంటకాలు, చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై లతో బాలయ్యకు కమ్మనైన విందు భోజనం ఏర్పాటు చేసారంట. ఈ విందు భోజనంలో గోపీచంద్ కూడా ప్రభాస్, బాలయ్యలతో కలిసి భోజనం చేసారంట. ఈ మేరకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa