ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం "బేబీ". విరాజ్ అశ్విన్ , నాగబాబు, లిరిష, కుసుమ తదితరులు నటిస్తున్న ఈ సినిమా టీజర్ నిన్న విడుదల కాగా, ఆడియన్స్ ఈ టీజర్ కు ఫుల్ ఫిదా అవుతున్నారు. "మొదటి ప్రేమకు మరణం లేదు... మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది." ... అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ హీరోహీరోయిన్ల్ చిన్ననాటి సున్నితమైన ప్రేమతో కంటిన్యూ అవుతుంది. టీజర్ లాస్ట్ లో బిగ్ సర్ప్రైజ్ అండ్ సస్పెన్స్ ఉంటుంది. మొత్తానికి టీజర్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అందుకే ఈ టీజర్ కు యూట్యూబులో 1 మిలియన్ కు పైగా వ్యూస్ రావడమే కాక #2 పొజిషన్ లో దూసుకుపోతుంది.
బేబీ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తుండగా, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీనివాస కుమార్ నిర్మిస్తున్నారు. విజయ్ బుగ్లాని సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa