ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రాన్ని USAలో విడుదల చేయనున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 06:10 PM

ఏఆర్ మోహన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమా లో శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అల్లరి నరేష్ ఈ సినిమాలో ఎలక్షన్ డ్యూటీపై గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమా నవంబర్ 25న విడుదల కానుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఇటీవలే యశోద మూవీతో హిట్ అందుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని యూఎస్‌లో విడుదల చేయనున్నట్టు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తుండగా, హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa