గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా 2023 సంక్రాంతికి భారీగా విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, కెజిఎఫ్ లో ఆండ్రూస్ పాత్రను పోషించిన కన్నడ నటుడు అవినాష్ వీరసింహారెడ్డిలో పవర్ఫుల్ పాత్ర చేస్తున్నట్లు తాజా సమాచారం.
గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్, టీజర్కి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa