టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. టీజర్ కి సినీప్రేమికుల నుండి భారీ స్పందన లభించింది.
ఇప్పుడు బాబీ మరియు అతని టీమ్ ప్రస్తుతం ఈ సినిమా టీజర్పై పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా టీజర్ను భారీగా విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ సింహా పవర్ఫుల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa