గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా 2023 సంక్రాంతికి భారీగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, వీర సింహారెడ్డి థియేట్రికల్ బిజినెస్ దాదాపు 70 కోట్ల వరకు ఉండవచ్చని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్, టీజర్కి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. నవంబర్లో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు.
ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa