సాయి కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం మసూద. తిరువీర్ రెడ్డి హీరోగా, గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 11న విడుదల కావాల్సి ఉండగా, తాజాగా విడుదల తేదీ వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. నవంబర్ 18న రిలీజ్ చెయ్యడానికి కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకున్నారు. పోతే, ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మూడవ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa