సినిమాల్లోకి వచ్చిన అనతికాలంలోనే పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకుని నేషనల్ క్రష్ గా స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంది కన్నడ భామ రష్మిక మండన్నా. 2016లో కిరిక్ పార్టీ తో సినీరంగ ప్రవేశం చేసిన రష్మిక ఆపై అన్ని విజయవంతమైన సినిమాలలో నటిస్తూ, సక్సెస్ గ్రాఫ్ ను పెంచుకుంటూ పోయింది.
ఈ క్రమంలో ఆమెపై పుకార్లను, నెగిటివిటీని స్ప్రెడ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు. తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్, అన్ వాంటెడ్ రూమర్స్ పై రష్మిక స్పందించింది. ఈమేరకు ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగకర పోస్ట్ ను షేర్ చేసింది. నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు నాపై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ట్రోలర్స్ కి నేనొక పంచింగ్ బ్యాగ్ లాగా మారిపోయాను. నాపై వస్తున్న విమర్శలు, నెగిటివిటీ శృతి మించిపోతుంది. ఈ కారణంగా నా స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. కానీ, ఈ విమర్శలను సానుకూల దృక్పథంతో తీసుకుని, మరింత బలంగా మారడానికి ప్రయత్నిస్తున్నాను. మిమ్మల్ని నవ్వించడం ద్వారానే నేను సంతోషంగా ఉంటాను.. అందరి పట్ల దయగా ఉండండి.. అంటూ రష్మిక తన నోట్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ మీడియాలో వీరవిహారం చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa