టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో రవితేజ వైజాగ్ రంగారావు గా ఔట్ అండ్ అవుట్ మాస్ పోలీస్ గా కనిపించనున్నాడు అని లేటెస్ట్ టాక్.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో చిరు, రవితేజతో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా కనిపించనుంది అని ఫిల్మ్ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి ఎటువంటి అధికారక ప్రకటన రానప్పటికీ ఈ వార్త సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. దేవి శ్రీ ప్రసాద్, వీరిద్దరికి ఎనర్జీ మాస్ సాంగ్ ని ట్యూన్ చేయగా, శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేశారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ సింహా పవర్ఫుల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa