గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సినిమా 2023 సంక్రాంతికి భారీగా విడుదల కానుంది.
బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో చాలా హైలైట్ సీన్స్ ఉండగా, ఇంటర్వెల్ సీన్ ఈ సినిమాకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని లేటెస్ట్ టాక్. ఈ సినిమా ఇంటర్వెల్ సీన్లో ఒక యాక్షన్ సీన్ ఉంటుందని, బాలయ్య శృతి హాసన్ పాత్రలకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయని సమాచారం. బాలయ్య ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేలా ఇంటర్వెల్ సీన్ ఉంటుందని దర్శకుడు గోపీచంద్ మలినేని వెల్లడించారు.
ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa