లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేష్ 'స్వాతిముత్యం' సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అక్టోబర్ 5, 2022న దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాటుఫామ్ ఆహా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా, ఈ సినిమా అక్టోబర్ 28, 2022 నుండి స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుందని ఆహా ప్రకటించింది. కానీ తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రీమియర్ తేదీని అక్టోబర్ 24, 2022కి ఆహా ప్రీపోన్ చేసింది.
ఈ చిత్రంలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రావు రమేష్, సుబ్బరాజు, హర్షవర్ధన్, గోపరాజు రమణ, ప్రగతి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa