సెల్వరాఘవన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 'నానే వరువేన్' సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాలో ఎల్లి అవ్రామ్ అండ్ ఇందుజా రవిచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి 'నేనే వస్తున్నా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 2 గంటల 15 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉంది అని సమాచారం.
ప్రభు, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సెల్వరాఘవన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబర్ నెలాఖరున ఈ సినిమా విడుదల కానుంది. వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ విలన్గా కూడా కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa