ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాలిడ్ అప్డేట్ తో...ఎట్టకేలకు స్పందించిన పుష్ప మేకర్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 02:01 PM

గతేడాది విడుదలై దేశవ్యాప్త ప్రభంజనం సృష్టించిన సినిమా పుష్ప. సుకుమార్ డైరెక్షన్లో అల్లుఅర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలై, విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో సీక్వెల్ పుష్ప ది రూల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు ఈ సినిమాపై ఒక్క అధికారిక ప్రకటన రాకపోవడంతో, బన్నీ ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు.
తాజాగా పుష్ప మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 3,4,5 తారీఖుల్లో, తిరుపతి లో "పుష్ప :ది రూల్" కు సంబంధించిన నటీనటుల ఆడిషన్ జరుగుతుందని ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ మేరకు తిరుపతి, న్యూ బాలాజీ కాలనీ లోని మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆడిషన్స్ జరుగుతాయని తెలిపారు. ముఖ్య గమనికగా చిత్తూరు యాస వచ్చి ఉండాలని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో పుష్ప సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తుంది. దీంతో బన్నీ అభిమానులు సూపర్ ఎక్సయిటింగ్ గా ఫీల్ అవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa