ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తున్న '777 చార్లీ' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 03:30 PM

టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టి చివరిసారిగా స్క్రీన్ పై 'అతడే శ్రీమన్నారాయణ' సినిమాలో కనిపించాడు. ఇప్పుడు తాజాగా '777 చార్లీ' అనే కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. కిరణ్‌రాజ్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 10, 2022న వివిధ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, జూన్ 7, 8 న హైదరాబాద్, వైజాగ్‌లలో ఈ సినిమా స్పెషల్ షోలను ప్రదర్శించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తుంది అని సమాచారం. అంతేకాకుండా, ఈ చిత్రం భారతదేశంలోని 19 నగరాల్లో వేర్వేరు తేదీల్లో ప్రదర్శించబడుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. చార్లీ, సంగీత, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. జిఎస్ గుప్తా, రక్షిత్ శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నోబిన్ పాల్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa