శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన "మేజర్" సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. "మేజర్" చిత్రం భారతదేశంలోని ముంబైలో 26-11 మధ్య జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందించబడింది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం OTT స్ట్రీమింగ్ భాగస్వామిని లాక్ చేసినట్లు సమాచారం. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రైట్స్ ని భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూలై లేదా ఆగస్టులో ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని సమాచారం. ఈ సినిమాకి GMB ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఇండియా మరియు AplusS మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa