'మన్మధుడు', 'మురారి', 'ఇంద్ర' వంటి సినిమాలలో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకున్న గ్లామర్ బ్యూటీ సోనాలి బింద్రే ఇప్పుడు సినిమాలలోకి రి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. క్యాన్సర్ తో బాధపడిన ఈ స్టార్ హీరోయిన్ యుఎస్ లో చికిత్సను పొంది క్యాన్సర్ను జయించింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత OTT షోతో మళ్లీ రి-ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ZEE5 ఒరిజినల్ డ్రామా సిరీస్ 'ది బ్రోకెన్ న్యూస్' తో సోనాలి బింద్రే స్ట్రీమింగ్ స్పేస్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు లేటెస్ట్ టాక్. తాజాగా ఇప్పుడు ఈ గ్లామర్ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో, డబ్బు కోసమే చాలా సినిమాలు చేశానని చెప్పింది. ప్రస్తుతం ఇప్పుడు హిందీ మరియు తెలుగు సినిమాలు ఉన్నాయని తన కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యలతో ఉన్నందున డబ్బు కోసం మాత్రమే చేయడానికి అంగీకరించింది అని వెల్లడించింది. ఈ షోలో పాటల్ లోక్ స్టార్ జైదీప్ అహ్లావత్ మరియు శ్రియా పిల్గావ్కర్ కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa