బాలీవుడ్ దాచిన రహస్యాల్లో తనొకరని చెబుతోంది అందాల భామ మంజరి పఢ్నిస్. తనను తాను ప్రచారం చేసుకోకపోవడం వల్లే వెండితెరకొచ్చిన ఈ దశాబ్దంన్నర కాలంలో అగ్ర తారగా ఎదగలేకపోయానని చెప్పింది. 2004లో రక్ సఖో తో రక్ లో చిత్రంతో బాలీవుడ్కు పరిచయమైంది మంజరి. తర్వాత వచ్చిన జానే తూ యా జానే నా చిత్రంతో పేరు తెచ్చుకుంది. తెలుగులో సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం చిత్రంలో నరేష్ సరసన నటించింది. ఎన్టీఆర్ శక్తి చిత్రంలో కీలక పాత్రలో నటించింది. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నా…వేగంగా ఎదగలేకపోయానని బాధపడుతోంది.
ఎవరినీ అవకాశాలు అడిగే తత్వం కాకపోవడమే తనకు అవకాశాలు తగ్గడానికి కారణమైందని మంజరి చెబుతోంది. ఇటీవల ఓ ముఖాముఖిలో ఈ నాయిక మాట్లాడుతూ….బాలీవుడ్ దాచిన రహస్యాల్లో నేనొకరిని. నా సత్తాకు తగిన గుర్తింపు ఇంకా దక్కలేదు. నా సినిమాలే మాట్లాడతాయని అనుకుని…నా గురించి ప్రచారం చేసుకోలేదు. కానీ నటనలో ప్రతిభ చూపించినా ప్రభావం కనిపించలేదు. ఇప్పటిదాకా ఎవరి దగ్గరకి మీతో పనిచేయాలని ఉంది అడగలేదు. దాంతో నట ప్రయాణం వేగంగా సాగలేదు. అయితే ఇకపై జోరు పెరుగుతుందనే ఆశిస్తున్నాను. అని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa