అనసూయ భరద్వాజ్..తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన అందాల యాంకర్. అయితే అనసూయ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా వీలున్నప్పడల్లా.. సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది అనసూయ. ఆ సినిమాలో రంగమ్మత్తగా.. అదరగొడుతూ ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఇంకా చెప్పాలంటే రంగమ్మత్తగా అనసూయను తప్పా మరోకరిని ఊహించుకోలేము. అంతలా మెప్పించింది అనసూయ. అలా అటూ డిగ్లామర్ పాత్రల్లో నటిస్తూనే అప్పుడప్పుడూ గ్లామర్ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా అనసూయ తన ట్విట్టర్ అకౌంట్లో రంగస్థలం చిత్రానికి సంబందించిన కొన్ని పిక్స్ను షేర్ చేసింది. ఆ పిక్స్లో రామ్ చరణ్కు గోరుముద్దలు పెడుతోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ అనసూయ అప్పటి రంగస్థలం షూటింగ్ విషయాలను గుర్తుచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె తన పోస్ట్లో రాస్తూ.. ఓయ్ చిట్టిబాబు.. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా నువ్వు నువ్వులా ఉన్నందుకు.. జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం ఆ రంగస్థలం మూవీ. ధన్యవాదాలు అంటూ అప్పటి సంగతుల్నీ గర్తుచేసుకుంది. అంతేకాకుండా చరణ్కు పుట్టిన రోజు విషేస్ తెలుపుతూ..ఇందా బర్త్ డే బువ్వ కూడా తినై అంటూ రామ్ చరణ్ను ఉద్దేశిస్తూ రాసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa