ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాపై అవగాహాన కల్పిస్తున్న సినీ ప్రముఖులు....

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2020, 12:11 PM

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. కరోనా దాటికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ మహమ్మారిపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా కొందరు ఈ వైరస్ గురించి భయపడుతూనే వున్నారు. దీంతో ఈ వైరస్ పై అవగాహన కల్పించడానికి సినీ ప్రముఖులు కూడా ముందుకు వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ ఈ వైరస్ గురించి అవగాహన కల్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. విజయ దేవరకొండ మాత్రమే కాక దర్శక ధీరుడు రాజమౌళి కూడా జాగ్రత్తలు పాటించి ఈ మహమ్మారిని తరికొట్టాలన్నారు. యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ కూడా కరోనా గురించి అవగాహన తెలిపేందుకు ఓ మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కరోనాతో యుద్ధం చెయ్యడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యి కరోనాపై జయించాలని ఇందుకోసం అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాజాగా 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కూడా కరోనాపై అవగాహన కల్పించే వీడియో చేయించింది. ఈ వీడియోలో ఎన్టీఆర్, చరణ్ లు కరోనా రాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన ఆరు సూత్రాలను ప్రజలందరూ పాటించాలని తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa