తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పుడు ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. యాంకరింగ్.. సిరియల్స్ లో ప్రొడక్షన్ వ్యాల్యూస్, గ్రాఫిక్స్, కామెడీలో వినూత్న మార్పులు ఇలా ప్రేక్షకులు బుల్లితెరపై ఎన్నో ఎంట్ర టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ తిలకిస్తున్నారు. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన 'జబర్ధస్' ఇప్పటికే ఎన్ని పోటీలు వచ్చినా గట్టిగానే నిలబడుతుంది. జబర్ధస్త్ లో ఎంతో మంది నటులు బాగా పాపులర్ కావడంతో వెండితెరపై కూడా ఛాన్సులు వచ్చాయి. ఇక జబర్ధస్త్ లో ఏడేళ్లుగా జడ్జీలు మెగా బ్రదర్ నాగబాబు, ఎమ్మెల్య, నటి రోజా లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో నాగబాబు జబర్ధస్త్ నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే.ఆయనతో పాటు మరికొంత మంది జబర్ధస్త్ నటులు వెళ్లారు. జి తెలుగు లో వస్తున్న 'అదిరింది' కామెడీ షోలో వీరంతా కొనసాగుతున్నారు. అదిరింది లో జడ్జీగా నాగబాబు, నవదీప్ లు కొనసాగుతున్నారు. ఇప్పుడు రెండు కామెడీ షోలూ నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. రేటింగ్ ఫైటింగ్లో కత్తులు దూస్తున్నాయి. రోజా, నాగబాబులు చెరో కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరిస్తుండటంతో, పొలిటికల్ పంచ్లు పేలుతున్నాయి. జబర్దస్త్...ఖతర్నాక్ కామెడీ షో అంటూ యాంకర్లు అంటుంటే. - అదిరింది....మాటల్లేవ్... మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ వస్తుంది. ఒక షోకు రాణి స్మైలీ రోజా - మరో షోకు ఆరడుగుల బుల్లెట్ నాగబాబు.అయితే నాగబాబు వెళ్లిన తర్వాత జబర్దస్త్ కామెడీ షో కొన్ని వారాలు ఇబ్బంది పడిన మాట వాస్తవమే అయినా కూడా చాలా త్వరగా పుంజుకుంది. ఇప్పుడు కూడా రేటింగ్స్ అద్భుతంగా వస్తున్నాయి. రోజా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడప్పుడు గెస్ట్ లు రావడంతో అలరించారు. ప్రస్తుతం సింగర్ మను జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఇక అదిరింది కామెడీ షో అచ్చం జబర్ధస్త్ కాపీ అంటూ టాక్ వచ్చినా.. ఇక్కడి కమెడియన్లు జోరు కొనసాగిస్తున్నారు. కానీ రేటింగ్ పరంగా అదరగొట్టలేకపోతున్నారు. నాగబాబు 'అదిరింది' ఏమీ అదరడం లేదని టాక్ వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa