దాదాపు మూడేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'వకీల్ సాబ్' సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ అంతగా ఉండదు కాబట్టి త్వరగా షూటింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకపక్క 'పింక్' రీమేక్ చేస్తూనే మరోపక్క క్రిష్ దర్శకత్వంలోనూ సినిమా వేగవంతంగా పూర్తి చేస్తున్నాడు.చారిత్రక నేపథ్యంతో నడిచే క్రిష్ చిత్రాన్ని కూడా ఈ సంవత్సరమే విడుదల చేయాలని ప్లాన్ లో పవన్ ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇక మూడో సినిమా హారిష్ శంకర్ సినిమాని ఈ ఏడాదే సెట్స్ మీదకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు పవన్. ఇప్పటికే రాజకీయాలు, సినిమా షూటింగ్ లతో క్షణం తీరిక లేని పవన్ హరీష్ సినిమాని చాలా స్పీడుగా చుట్టేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లోనే విడుదల చేసేట్టుగా ప్లాన్ చేస్తున్నాడట. మరోపక్క పూరి, త్రివిక్రమ్ సినిమాలను పవన్ లైన్ లో పెట్టినట్లుగా న్యూస్ నడుస్తుంది. ఇక పూరి మేకింగ్ స్టయిల్, ఆయన స్పీడు ఎవరికీ రాదు.. ఇక పూరి జగన్నాధ్ తో చేసే సినిమాని 2021 ఏడాది చివరిలోపు పూర్తి చెయ్యాలనే డెడ్ లైన్ పవన్ పెట్టుకున్నాడని అంటున్నారు. మొత్తంగా రెండు సంవత్సరాలలో నాలుగు సినిమాలను ప్రేక్షకుల ముందు ఉంచబోతున్నాడనే టాక్ వినపడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa