సినిమా రంగానికి తానేంటో నిరూపించేసుకున్నారు ప్రముఖ నటుడు నరేశ్. అలనాటి నటి విజయ నిర్మల కుమారుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నరేశ్కు ఇప్పటికీ సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన కుమారుడు నవీన్ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 2015లో వచ్చిన ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు నవీన్. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన ‘నందినీ నర్సింగ్ హోం’ కూడా పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. నవీన్ సినిమాలకు తండ్రి ప్రచారం కల్పించినా పద్దగా ఫలితమేమీ లేదు. దాంతో ఈసారి రంగంలోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు దిగాడు. వరసకు బాబాయ్ అయిన మహేశ్ నవీన్ కెరీర్కు తన వంతు సాయం చేయాలనుకున్నాడు. అందుకే నవీన్ తాజాగా నటించిన ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమాకు ప్రచారం కల్పిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. బాలాజీ సినిమాకు దర్శకత్వం వహించారు. రావు రమేశ్, శ్రీనివాస్ అవసరాల, కోటా శ్రీనివాసరావు, జయసుధ వంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టి్స్ట్లు ఇందులో ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ను తాజాగా మహేశ్ తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేశారు. సినిమా ట్రైలర్లోని ప్రతీ అంశం తనకెంతో నచ్చిందని తెలిపారు. నవీన్కు చిత్రబృందానికి విషెస్ తెలిపారు. మరి మహేశ్ సినిమాకు కల్పిస్తున్న మైలేజ్ ఏ స్థాయిలో సినిమాకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి. అసలైతే సినిమాకు మేలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. మొత్తానికి అక్టోబర్ 5న విడుదలకు నోచుకుంటోంది. కృష్ణ కుటుంబంలో మరో వారసుడు తన సినీ కెరీర్ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనే కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ కుమారుడు అశోక్. ‘అదే నువ్వు అదే నేను’ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. సినిమాను అధికారికంగా ప్రకటించేశారు కూడా. కానీ అశోక్ ఈ సినిమాను చేజార్చుకున్నాడని, దాంతో ఈ సినిమాలో నటించే అవకాశం నాగచైతన్యకు వచ్చిందని వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం మహేశ్.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, విజయశాంతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మహేశ్ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా మేకు వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa