ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించిన సాయి ధరమ్ తేజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 04:45 PM

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన వివాహంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఎప్పటినుంచో ఆయన పెళ్లి గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త సంతోషాన్నిచ్చింది. "వచ్చే ఏడాదిలో నా వివాహం జరుగుతుంది" అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు. తనకు మంచి సినిమాలు, చక్కటి జీవితం ప్రసాదించిన శ్రీవారికి కృతజ్ఞతలు చెప్పేందుకే తిరుమల వచ్చినట్లు చెప్పారు. కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులతో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందని, దీనిపై తనకు చాలా నమ్మకం ఉందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa