టాలీవుడ్ యువ నటుడు సిద్దూ జొన్నలగడ్డ రాబోయే చిత్రం 'తెలుసు కదా' అక్టోబర్ 17న దీపావళి సీజన్లో గొప్ప విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీనిధి శెట్టి మరియు రాశి ఖన్నా ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 15న సాయంత్రం 5 గంటల నుండి హైదరాబాద్ లోని KLH యూనివర్సిటీ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో వైవా హర్ష ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా జ్ఞాన శేఖర్ బాబా, ఎడిటర్ గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా మరియు కాస్ట్యూమ్ డిజైనర్ గా శీతల్ శర్మ ఉన్నారు. చార్ట్-టాపింగ్ మ్యూజిక్కి పేరుగాంచిన థమన్ ఎస్ సౌండ్ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి సెలబ్రిటీ స్టైలిస్ట్ నీర్రజ కోనా దర్శకత్వం వహిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa