ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గోదారి గట్టుపైనా' ఫస్ట్ బ్రీజ్ విడుదలకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 09:56 PM

టాలీవుడ్ యువ నటుడు సుమంత్ ప్రభాస్ మేమ్ ఫేమస్‌ చిత్రంతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసారు. ఇటీవలే తొలి దర్శకుడు సుబాష్ చంద్రతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి మేకర్స్ 'గోదారి గట్టుపైనా' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ బ్రీజ్ ని సెప్టెంబర్ 25న సాయంత్రం 5:07 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. నిధి ప్రదీప్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు, రాజీవ్ కనకాల మరియు లైలా ఇతర ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. సాయి సంతోష్ సినిమాటోగ్రఫీని నిర్వహించడంతో, నాగ వంశి కృష్ణ సంగీతాన్ని కంపోజ్ చేస్తుండగా, ప్రవాల్య ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్నారు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa