ఒకవేళ అప్పట్లోనే ఇంతటి అంకితభావం, ప్రతిభ ఉన్న యువ బృందం నాకు దొరికి ఉంటే, నేను బహుశా రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదేమో" అంటూ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొత్త చిత్రం 'ఓజీ' ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన హుషారుగా ప్రసంగించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా హాజరైన లక్షలాది అభిమానుల కేరింతల మధ్య ఈ ఓజీ కాన్సెర్ట్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ ఓజీ సినిమాలో తాను ధరించిన గ్యాంగ్ స్టర్ డ్రెస్ తో రావడం విశేషం.ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పవన్ కల్యాణ్, చేతిలో కత్తి పట్టుకుని ర్యాంప్పై నడుస్తూ వేదికపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. భారీ వర్షంలో తడుస్తూనే ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సినిమాపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ, "ఈ సినిమాను నేను ఇంతలా ప్రేమిస్తానని ఊహించలేదు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్. వాళ్లిద్దరూ ఒక ట్రిప్లో ఈ సినిమా చేశారు. ఆ ట్రిప్లోకి నన్ను కూడా లాగేశారు. సుజీత్ చాలా తక్కువ మాట్లాడతాడు, కానీ సినిమా అద్భుతంగా తీస్తాడు. అతని విజన్ను తమన్ తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లాడు" అని వారిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించారు.తన రాజకీయ బాధ్యతల గురించి ప్రస్తావిస్తూ, "ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో నేను ఒక ఉప ముఖ్యమంత్రిని అన్న సంగతే మర్చిపోయాను. ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని కనిపిస్తే ప్రజలు ఊరుకుంటారా? కానీ కథ కోసం చేయాల్సి వచ్చింది. 'ఖుషీ' సినిమా సమయంలోనే ఇలాంటి కత్తి ఫైట్ ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు సుజీత్ దానికి ఒక అద్భుతమైన కథను అల్లి తెరపై చూపించాడు" అని అన్నారు. సినిమాలోని ప్రేమకథ గురించి మాట్లాడుతూ, కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్తో తన కెమిస్ట్రీ చాలా బాగా వచ్చిందని తెలిపారు.దర్శకుడు సుజీత్ తన వీరాభిమాని అని, 'జానీ' సినిమా విడుదల సమయంలో హెడ్బ్యాండ్ కట్టుకుని థియేటర్ల చుట్టూ తిరిగానని తనతో చెప్పాడని పవన్ గుర్తుచేసుకున్నారు. అలాంటి అభిమాని తనను డైరెక్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 'హంగ్రీ చీతా' వంటి పవర్ఫుల్ పాటలను ప్రదర్శించారు. పవన్ స్ఫూర్తితో రాసిన 'వాషి యో వాషి' హైకూకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో పవన్ కల్యాణ్ 'ఓజాస్ గంభీర' అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ వేడుకతో సినిమాపై ఉన్న హైప్ తారాస్థాయికి చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa