ప్రస్తుతం పెద్ద పేగు క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు చాలా మంది దీని బారిన పడుతున్నారు. ఇటీవల, యుక్త వయసులో కూడా పెద్ద పేగు క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారిని చూసి ఆరోగ్య నిపుణులు భయపడుతున్నారు.పెద్ద సమస్య ఏమిటంటే, దీని ప్రారంభ లక్షణాలు స్పష్టంగా కనిపించవు. అందుకే, క్యాన్సర్ ప్రాథమిక దశలోనే గుర్తించడం చాలా అవసరం.పెద్ద పేగు క్యాన్సర్ను కొలొరెక్టల్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా పెద్ద పేగు మరియు పురీషనాళంలో అభివృద్ధి చెందుతుంది. ఎక్కువగా 50 సంవత్సరాల పైవారిలో కనబడినప్పటికీ, ఈ మధ్యకాలంలో యువతలో కూడా కేసులు పెరుగుతున్నాయి. నిపుణుల , దీని ప్రధాన కారణం తప్పు ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు.గతంతో పోలిస్తే, పెద్ద పేగు క్యాన్సర్ కేసులు దాదాపు 3.2% పెరుగుతున్నాయి. అయితే, పెద్ద పేగు క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యమే.వైద్య నిపుణులు సూచించేది ఏమిటంటే: ఎలాంటి కారణం లేకుండా మలంలో ఎరుపు లేదా ముదురు రక్తం కనపడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది పెద్ద పేగు క్యాన్సర్ యొక్క ప్రధాన లక్షణం. అలాగే, మల విసర్జనలో మార్పులు, ఎక్కువసార్లు టాయిలెట్కు వెళ్లాల్సి రావడం, పొత్తి కడుపులో నొప్పి—ఇవి కూడా లే.కొంతమంది రోగులు ఒక్కసారిగా బరువు తగ్గడం, మలవిసర్జన చేసినా కడుపు ఖాళీగా అనిపించకపోవడం, తీవ్రమైన అలసట, నీరసం, ఆకలి తగ్గిపోవడం, తిన్నా కూడా బరువు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇవన్నీ కూడా పెద్ద పేగు క్యాన్సర్ సంకేతాలు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa