ఆంధ్రప్రదేశ్లో మరో హైవేను నాలుగు లైన్లుగా విస్తరించేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి పశ్చిమ ప్రకాశం జిల్లాకు, కర్నూలువైపు వెళ్లేవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. దీనికోసం అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. రాయలసీమ నుంచి రవాణాకు ఇది కీలకంగా మారుతుంది.. ఈ మేరకు ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు 113 కిలో మీటర్ల పొడవున నాలుగులైన్లుగా విస్తరిస్తారు.. సంతనూతలపాడు, పొదిలి దగ్గర బైపాస్లు వస్తాయి.. ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో విస్తరిస్తారు.
ఒంగోలు నుంచి కొనకనమిట్ల మీదుగా బేస్తవారిపేట వెళ్లే మార్గంలో ప్రయాణం కష్టంగా మారింది. ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి ప్రాంతాల్లో రోడ్డు చాలా ఇరుకుగా ఉంది.. చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమలు, లారీల వల్ల రోడ్డు దెబ్బతింది. ముఖ్యంగా మర్రిచెట్లపాలెం కూడలి నుండి చీమకుర్తి వరకు రోడ్డు చాలా దారుణంగా ఉంది. దీనికి తోడు ఆక్రమణలు కూడా పెరిగిపోయాయి. భారీ ట్రైలర్లు, టిప్పర్ల వల్ల మర్రిచెట్లపాలెం - ఒంగోలు మధ్య తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం రోడ్డును ప్రైవేటు భాగస్వామ్యంతో నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రైవేటు సంస్థ ద్వారా సర్వే కూడా చేశారు. ఈ రోడ్డు విస్తరించేందుకు.. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు ఇరువైపులా స్థలం ఎంత ఉంది అని చూస్తున్నారు.
రాయలసీమ జిల్లాల నుంచి కూరగాయలు, సరుకులు రావడానికి ఒక ముఖ్యమైన రహదారి ఉంది. అందుకే దీనిని నేషనల్ హైవే నాలుగు లైన్లుగా మార్చాలని గతంలో ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. సంతనూతలపాడు, పొదిలి పట్టణాల దగ్గర రోడ్డు చాలా ఇరుకుగా ఉండటంతో.. అక్కడ బైపాస్లు కట్టాలని భావిస్తు్న్నారు. ఈ హైవేను బేస్తవారిపేట వరకు నాలుగు లైన్లుగా విస్తరించి.. ఈ రోడ్డును అనంతపురం నేషనల్ హైవేకు కలుపుతారు. ఈ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించేందుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసే పనిలో ఉన్నారు. డీపీఆర్ వచ్చిన తర్వాత ఈ రోడ్డు విస్తకరణకు ఎంత భూమి సేకరించాలి, వ్యయం ఎంత అవుతుందో క్లారిటీ వస్తుందంటున్నారు అధికారులు. ఆ తర్వాత పనులు మొదలుపెడతారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa