ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 12:14 PM

 తిరుమల ఘాట్‌ రోడ్డులో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఏనుగుల గుంపు కలకలం రేపింది. రోడ్డుకు సమీపంగా పిల్ల ఏనుగులతో పాటు మొత్తం ఏడు ఏనుగులు వచ్చాయి. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది టార్చ్‌లైట్లు, సైరన్లు వినిపిస్తూ వాటిని అడవిలోకి వెళ్లేలా చేశారు.దీంతో అటు వెళుతున్న వాహనాలన్నీ నిచిపోయాయి. వెంటనే వాహనచోదకులు టీటీడీ అటవీశాఖకు, విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపారు. ఈ సందర్భంగా ఏనుగులు అటవీశాఖ సిబ్బంది పైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వారు చాకచక్యంగా ఏనుగులను అడవిలోకి తరిమేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa