భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. కొందరు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు డీప్ఫేక్, ఏఐతో రూపొందించిన వీడియోలు, ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలకు సంబంధించిన చిత్రాలను ప్రస్తుత పరిస్థితులకు జోడించి వైరల్ చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని అరికట్టడానికి పోలీసులు సోషల్ మీడియా పోస్ట్లపై నిఘా పెంచారు. దేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
తాజాగా, హైదరాబాద్కు చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని పాకిస్థాన్కు మద్దతుగా, భారతదేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె చిక్కుల్లో పడింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇలాంటి పోస్ట్లపై ప్రత్యేక నిఘా ఉంచింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు, తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన 8 వేల ఖాతాలను
హైదరాబాద్లోని మూడు పోలీస్ కమిషనరేట్ల సైబర్ క్రైమ్ పోలీసులు, ఐటీ విభాగాలు గత మూడు రోజులుగా విస్తృతంగా సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. తప్పుడు, విద్వేషపూరిత పోస్ట్లు పెట్టిన లేదా షేర్ చేసిన వారి ప్రొఫైల్లను వారు విశ్లేషిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి పోస్ట్లు ఉంటే, పోలీసులు స్వయంగా కేసులు నమోదు చేస్తున్నారు. కామెంట్లు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని, కేసుల్లో చిక్కుకుంటే జైలుకు పంపుతామని భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు:
దేశ భద్రత, సున్నితమైన సమాచారం గురించి పోస్ట్, కామెంట్ లేదా షేర్ చేసే ముందు అది నిజమైనదేనా అని నిర్ధారించుకోండి.
కేంద్ర ప్రభుత్వం 'ఫ్యాక్ట్చెక్' పేరుతో ఎప్పటికప్పుడు వాస్తవాలను తెలియజేస్తోంది. వాటిని పరిశీలించండి.
ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే అంశాలపై పోస్ట్లు చేయవద్దు.
ఇతరులు ఎవరైనా తప్పుడు సమాచారం లేదా దేశానికి వ్యతిరేకంగా పోస్ట్లు చేస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయండి.
![]() |
![]() |