ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం. ఐదుగురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 12:53 PM

శ్రీశైలం పుణ్యక్షేత్రం నుంచి బొలెరోలో తిరుగు పయనమైన భక్తుల వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. శనివారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోగా. 19మందికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోని వాసులు తమ చిన్నారులు పదవ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యారన్న సంతోషంలో.. స్వామివార్లకు మొక్కులు చెల్లించేందుకు ఆ కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులతో కలిసి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం పయనమయ్యారు. సంతోషంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే విధి వక్రీకరించి ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఐదుగురు చనిపోయారు. ఇంకా 13 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.శుక్రవారం సాయంత్రం సంఘటనా స్థలంలోనే నలుగురు చనిపోగా ఆ తర్వాత కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com