టెక్బాల్లో క్విమ్సీ అద్భుత ఘనత
నగోయా: ఐచి-నగోయా ఆసియా క్రీడలు 2026లో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్-సి ప్రాథమిక రౌండ్ మ్యాచ్లో భారత పురుషుల సాఫ్ట్ టెన్నిస్ జట్టు చైనీస్ తైపీ చేతిలో 0-3 తేడాతో ఓటమి పాలైంది. డబుల్స్ మ్యాచ్లో జయ్ మీనా-యోగేష్ చౌదరి జోడీ, సింగిల్స్లో ఆర్యన్ ఠాకూర్, రెండో డబుల్స్లో అనికేత్ పటేల్-ఓమ్ యాదవ్ జంట ప్రత్యర్థుల చేతిలో పరాజయం చెందారు. ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ భారత జట్టు, తమ తదుపరి మ్యాచ్లో మంగోలియాపై గెలిచి పుంజుకోవాలని ఆశిస్తోంది.
మరోవైపు, ఆసియా క్రీడల టెక్బాల్ పోటీల్లో భారత క్రీడాకారిణి క్విమ్సీ జోక్విమ్ డిసౌజా అద్భుత ప్రదర్శనతో మెరిసింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఎ మ్యాచ్లలో వరుసగా జపాన్కు చెందిన యుయినా సకమోటోపై 2-1తో, కంబోడియా అథ్లెట్ కోమ్యాన్ DYపై 2-0 తేడాతో ఘనవిజయాలు సాధించి నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధించింది. సింగిల్స్లో రాణించిన క్విమ్సీ, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మహమ్మద్ అనస్ ఇమ్రాన్ బేగ్తో కలిసి ఫిలిప్పీన్స్ జోడీతో తలపడనుంది.